News December 11, 2024

విజయవాడ: రెండు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- చెన్నై ఎగ్మోర్(MS) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08557 & 08558 రైళ్లకు 1 ఏసీ 3 టైర్ ఎకానమీ, ఒక స్లీపర్ కోచ్‌ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08557 VSKP- MS రైలును డిసెంబర్ 14 నుంచి 2025 మార్చి 1 వరకు, నం.08558 MS- VSKP రైలును డిసెంబర్ 15 నుంచి 2025 మార్చి 2 వరకు ఈ అదనపు కోచ్‌లతో నడుపుతామన్నారు.

Similar News

News January 22, 2025

VJA: 24 నుంచి జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు

image

విజయవాడ పటమటలోని జిల్లాపరిషత్ బాలుర పాఠశాలలో ఈ నెల 24 నుంచి 27 వరకు జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన వివరాలను DRO ఎం.లక్ష్మీనరసింహారావు మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పోటీల్లో 5 రాష్ట్రాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొంటున్నాయన్నారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లక్ష్మీనరసింహారావు వివరించారు.

News January 21, 2025

వీరులపాడు: బైక్ అదుపు తప్పి యువకుడు మృతి

image

వీరులపాడు మండల పరిధిలోని వెల్లంకి గ్రామంలో సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన కంచె సంతోష్ మెహతాగా గుర్తించారు. తమకు అండగా ఆసరాగా ఉంటాడనే కొడుకు మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 21, 2025

పమిడిముక్కల: రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి

image

పమిడిముక్కలలో నిన్న జరిగిన ప్రమాదంలో కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23), ముక్త దుర్గ బాబు(24)లు మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్‌చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పెద్ద కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతిల విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.