News June 15, 2024

విజయవాడ: రేపే UPSC పరీక్ష .. ఏర్పాట్లు పూర్తి

image

ఈ నెల 16వ తేది ఆదివారం UPSC పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఢిల్లీరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..నగరంలోని 25పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. విజయవాడలోని పరీక్షా కేంద్రంలో మెత్తం 11,112మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 9.30నుంచి 11.30గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30నుంచి 4.30వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందన్నారు.

Similar News

News October 2, 2024

మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిస్తాము: ఎస్పీ

image

మచిలీపట్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ గంగాధర్ రావు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమం జిల్లాలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం కోసమే జీవించి దేశం కోసమే మరణించిన వ్యక్తులలో లాల్ బహుదూర్ శాస్త్రి ఒకరని తెలిపారు.

News October 2, 2024

ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా నరసాపురం(NS), హైదరాబాద్(HYD) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.07631 HYD- NS ట్రైన్‌ను OCT 5 నుంచి NOV 30 వరకు ప్రతి శనివారం, నం.07632 NS- HYD ట్రైన్‌ను OCT 6 నుంచి DEC 1 వరకు ప్రతి ఆదివారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ ట్రైన్లు జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయి.

News October 2, 2024

ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనాలు ర‌ద్దు చేశాం: EO

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు ప్రారంభిస్తున్నామని ఆలయ EO కెఎస్ రామారావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్స‌వాలు ముగిసే వ‌ర‌కూ అంతరాలయ దర్శనాలు ర‌ద్దు చేశామన్నారు. ఉత్స‌వాల‌కు 15 లక్షల‌ మంది వ‌ర‌కూ వ‌స్తార‌ని అంచ‌నా వేశామన్నారు. శరన్నవరాత్రులలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు చండీయాగం నిర్వహిస్తామన్నారు.