News April 6, 2025

విజయవాడ: రైలు ప్రయాణికులకు ముఖ్య సూచన 

image

నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే ఒక రైలుకు ఖాజీపేట(TG)లో తాత్కాలికంగా స్టాప్ తొలగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మే 22 నుంచి 28 వరకు నం.18519 విశాఖపట్నం-ముంబై LTT ఎక్స్‌ప్రెస్ ఖాజీపేటలో ఆగదని, ఖాజీపేట మీదుగా కాక ఈ రైలు గుంటూరు, మౌలాలీ మీదుగా అమ్ముగూడ వెళుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. 

Similar News

News October 27, 2025

పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.

News October 27, 2025

ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్: రహానే

image

టీమ్ ఇండియా సెలక్టర్లపై రహానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆటలో ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్. అనుభవమున్న, డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్న నా లాంటి ప్లేయర్లను సెలక్టర్లు కన్సిడర్ చేయాలి. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఎక్కువ ఛాన్సులివ్వాలి. కానీ వారి నుంచి సరైన కమ్యునికేషన్ లేదు. సెలెక్ట్ చేసినా చేయకపోయినా గేమ్‌ను ఆస్వాదిస్తా. BGT 2024-25లో టీమ్‌కు నా అనుభవం పనికొచ్చేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News October 27, 2025

ASF: నేడు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

image

ASF జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపుకు 680 మంది వ్యాపారులు దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులపై లక్కీ డ్రా కార్యక్రమం నేడు జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ASF, కెరమెరి-గోయాగాం, WKD, తిర్యాని, గూడెం మండలాల్లో ఉన్న దుకాణాలకు తమ పేర్లు లక్కీ డ్రాలో ఎంపికైతే అదృష్టం తలుపు తట్టినట్లే అంటూ వ్యాపారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.