News February 6, 2025
విజయవాడ రైల్వే డివిజన్ ఇకపై ఆ జోన్ పరిధిలోకి

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని రైల్వేశాఖ తాజాగా ఖరారు చేసింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న విజయవాడ డివిజన్ ఇకపై దక్షిణ కోస్తా రైల్వే జోన్ కిందకి రానుంది. అలాగే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి(ఇబ్రహీంపట్నం మండలం)- మోటుమర్రి సెక్షన్ విజయవాడ డివిజన్ కిందకి రానున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
Similar News
News July 6, 2025
ఈనెల 7న కడపకు YS జగన్

ఈనెల 7వ తేదీ కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి YS జగన్ వస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కే.నాగేశ్వర్రెడ్డి తెలిపారు. 7వ తేది మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 8న ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. మహానేత YS రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారని అన్నారు. అనంతరం పులివెందులకు మీదుగా బెంగళూరుకు చేరుకుంటారన్నారు.
News July 6, 2025
31 నుంచి సికింద్రాబాద్లో అగ్నివీర్ ర్యాలీ

TG: ఈనెల 31 నుంచి సికింద్రాబాద్ AOC సెంటర్లోని జోగిందర్ స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ(జీడీ), టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్మెన్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈవెంట్లు SEP 14 వరకు కొనసాగుతాయి. అటు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు AOC సెంటర్ హెడ్క్వార్టర్ను లేదా <
News July 6, 2025
బౌద్ధమత గురువు దలైలామా 90వ జన్మదినం

బౌద్ధమత అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా నేడు 90వ జన్మదినం జరుపుకుంటున్నారు. టిబెట్లోని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన టెన్జింగ్ గ్యాట్సో కేవలం ఐదేళ్ల వయసులోనే 14వ దలైలామా అయ్యారు. చైనా ఆక్రమణ తర్వాత 1959లో ఇండియాకి నిర్వాసితుడిగా వచ్చారు. తన సందేశాలతో 1989లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ‘మనసు ప్రశాంతంగా ఉంటే, ప్రపంచమూ ప్రశాంతంగా ఉంటుంది’ అన్న ఆయన మాటలు ఇప్పుడు అన్ని దేశాలకు అవసరం.