News January 23, 2025

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

విజయవాడలోని మహానాడు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జక్కుల వినయ్, జీవన్, గోపి అనే యువకులు ఓ రెస్టాంరెంట్‌లో చెఫ్‌లుగా పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని స్కూటీపై ముగ్గురు వస్తుండగా మహానాడు జంక్షన్ వద్ద ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో గోపి స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 19, 2025

వల్లభనేని వంశీ కేసులో అప్డేట్

image

మాజీ ఎమ్మెల్యే వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో నేడు విచారణ జరిగింది. జైలులో వంశీకి అందిస్తున్న వివరాలను సమర్పించాలని జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. జైలర్ వివరాల ప్రకారం తీర్పు ప్రకటిస్తామని న్యాయమూర్తి గురువారానికి కేసు వాయిదా వేశారు

News February 19, 2025

పామర్రు యువకుడిపై కేసు నమోదు

image

పామర్రు మండలం పెదమద్దాలికి చెందిన ఓ యువకుడిపై కేసు నమోదైంది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. మండలానికి చెందిన బాలికను యువకుడు వేణు వేధిస్తున్నట్లు మంగళవారం బాలిక తల్లి పామర్రు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అతడిని పలుమార్లు హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోలేదని ఆమె చెప్పినట్లు వివరించారు. ఈ విషయమై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News February 19, 2025

పమిడిముక్కలలో యాక్సిడెంట్.. యువతి మృతి

image

పమిడిముక్కల మండలం తాడంకి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి నర్రా లక్ష్మీ ప్రసన్న (20) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన లక్ష్మీ ప్రసన్న తాడిగడపలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి బైక్‌పై ఆమె మచిలీపట్నానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. సీఐ చిట్టిబాబు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!