News February 27, 2026
విజయవాడ: లాడ్జిలలో వ్యభిచారం

విజయవాడలోని గవర్నర్ పేటలో లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. ఓ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఇద్దరు విఠులను అరెస్ట్ చేసి నలుగురు మహిళలను వ్యభిచార కూపం నుంచి విడిపించినట్లు సీఐ నాగమురళి తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహిళలను సంరక్ష కేంద్రానికి పంపించామన్నారు.
Similar News
News April 15, 2026
డీలిమిటేషన్ బిల్లుపై స్పందించిన కేసీఆర్

డీలిమిటేషన్ బిల్లుపై కేసీఆర్ స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఏ నిర్ణయాన్ని ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఎర్రవెల్లి నివాసంలో కేటీఆర్, హరీశ్ రావులతో సమావేశమై చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించిన ఆయన, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు. బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాతే పార్టీ నిర్ణయం వెల్లడిస్తామన్నారు.
News April 15, 2026
మరో జలసంధిపై ట్రంప్ కన్ను.. భారత్కు కలిసొచ్చేనా?

హార్ముజ్ తర్వాత ట్రంప్ కన్ను మలక్కా జలసంధిపై పడ్డట్లు తెలుస్తోంది. ఇండోనేషియాతో కుదిరిన డిఫెన్స్ డీల్ అందుకు బలం చేకూర్చుతోంది. మలక్కా జలసంధి ఇండస్ట్రియల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, చమురు రవాణాకు కీలకం. చైనా తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతోంది. ఇక అండమాన్ నికోబార్ దీవులు ఈ జలసంధికి సమీపాన ఉండటంతో హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు భారత్, US కలిసి పనిచేసే అవకాశం ఉంది.
News April 15, 2026
డీలిమిటేషన్ బిల్లుపై స్పందించిన కేసీఆర్

డీలిమిటేషన్ బిల్లుపై కేసీఆర్ స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఏ నిర్ణయాన్ని ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఎర్రవెల్లి నివాసంలో కేటీఆర్, హరీశ్ రావులతో సమావేశమై చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించిన ఆయన, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు. బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాతే పార్టీ నిర్ణయం వెల్లడిస్తామన్నారు.


