News February 14, 2025

విజయవాడ: వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

image

వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్‌తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు.

Similar News

News February 24, 2026

90% కాఫ్ సిరప్ ఫ్యాక్టరీలను తనిఖీ చేశాం: డీసీజీఐ

image

10 నెలల్లో దేశంలోని 1,150 దగ్గుమందు తయారీ కేంద్రాలను తనిఖీ చేసినట్లు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. వీటిలో 850 సంస్థలకు CAPA హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. దేశంలోని దాదాపు 90% సంస్థలను ఆడిట్ చేశామని పేర్కొంది. తీవ్రమైన ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. గత ఏడాది దగ్గుమందు వల్ల <<17936583>>మరణాలు<<>> సంభవించడంతో కేంద్రం తనిఖీలను ముమ్మరం చేసింది.

News February 24, 2026

HYD: క్యాబినెట్‌ మీటింగ్‌లో కీలక అంశాలు

image

HYDలో ఎలివేటెడ్ కారిడార్ కోసం రక్షణ శాఖకు చెందిన 42 ఎక‌రాలు తీసుకున్న నేపథ్యంలో బదులుగా కాప్రాలో 153 ఎక‌రాలు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నియోపోలీస్‌లో నీటి స‌ర‌ఫ‌రా, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న, కోహెడలో 239 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ ఏర్పాటు కోసం మార్కెట్ కమిటీకి భూకేటాయింపు, CURE ఏరియాలో 2BHK సముదాయాల్లో ఉన్న షాప్స్ వేలం వేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

News February 24, 2026

HYD: క్యాబినెట్‌ మీటింగ్‌లో కీలక అంశాలు

image

HYDలో ఎలివేటెడ్ కారిడార్ కోసం రక్షణ శాఖకు చెందిన 42 ఎక‌రాలు తీసుకున్న నేపథ్యంలో బదులుగా కాప్రాలో 153 ఎక‌రాలు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నియోపోలీస్‌లో నీటి స‌ర‌ఫ‌రా, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న, కోహెడలో 239 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ ఏర్పాటు కోసం మార్కెట్ కమిటీకి భూకేటాయింపు, CURE ఏరియాలో 2BHK సముదాయాల్లో ఉన్న షాప్స్ వేలం వేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.