News March 10, 2025
విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో అప్డేట్

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సత్యవర్ధన్ న్యాయవాది సమయం కోరారు. విచారణ అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ కూడా వాయిదా పడింది. వంశీ భద్రత రీత్యా బ్యారక్ మార్చలేమని అధికారులు న్యాయమూర్తికి వివరించారు.
Similar News
News April 11, 2026
నెల్లూరు: నేటి నుంచి చేపల వేట బంద్

61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు సంతానోత్పత్తి పెరిగే సమయం కావడంతో ఈ సమయంలో వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో నేటి నుంచి చేపల వేట ఆగిపోనుంది. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు, మోటారు బోట్ల ద్వారా చేపల వేట సాగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.
News April 11, 2026
అల్లూరి: ఇంటిలోనే గర్భిణికి ప్రసవం

కొయ్యూరు మండలంలోని కాకరపాడు గ్రామానికి చెందిన ఒంటరి సునీత (24)అనే నిండు గర్భిణికి శుక్రవారం సాయంత్రం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో, 108 సిబ్బంది అంబులెన్సులో వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ వర ప్రసాద్ గర్భిణికి ఇంట్లోనే ప్రసవం చేశారు. అనంతరం, వైద్యం కోసం తల్లిబిడ్డలను రాజేంద్రపాలెం పీహెచ్సీకి తరలించారు.
News April 11, 2026
ఖాజీపేటలో కీర్తన హత్య.. విస్తుపోయే విషయాలు

కడప(D)లో శుక్రవారం విద్యార్థిని హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు వెంకటేశ్ డిగ్రీ చదువుతూ.. ఇంటర్ చదువుతున్న కీర్తనను ప్రేమపేరుతో బెదిరించేవాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఇద్దరిదీ ఒకే కులం.. పైగా <<19614640>>వరుసకు అన్న<<>> అవుతావని హెచ్చరించారు. కాగా ఏడాదిగా దూరంగా ఉన్న వెంకటేశ్ నిన్న స్నేహితుడు ప్రవీణ్తో కలిసి కీర్తన ఇంటికి వచ్చి ఆమె గొంతుకోసి పరారయ్యాడు.


