News August 23, 2024
విజయవాడ: విమానంలో మగబిడ్డకు ప్రసవం

సింగపూర్ నుంచి చెన్నైకి వస్తున్న దీప్తి అనే మహిళ విమానంలోనే ప్రసవించి. బుధవారం రాత్రి ఆమె సింగపూర్ నుంచి చెన్నైకి బయలుచేరారు. మార్గమధ్యంలో అర్థరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వైద్యురాలు, అక్కడున్న మహిళల సాయంతో క్షేమంగా దీప్తికి ప్రసవం చేశారు. అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. విమానం చెన్నై చేరుకోగానే వైద్యబృందం తల్లి, బిడ్డను పరిశీలించి క్షేమంగా ఉన్నారన్నారు.
Similar News
News December 19, 2025
DRC సమావేశాలను సీరియస్గా తీసుకోండి: బుద్ధప్రసాద్

ఎంతో ప్రాధాన్యత కలిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం (DRC) నిర్వహణను సీరియస్గా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ను కోరారు. శుక్రవారం సాయంత్రం సుభాష్ అధ్యక్షతన DRC సమావేశం నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 4 గంటలకు ప్రారంభం కావడం పట్ల బుద్ధప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
News December 19, 2025
పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పరిశ్రమలు, తదితర అంశాల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో APIIC ద్వారా గత 2ఏళ్లలోపు మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని వారితో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
News December 19, 2025
పామాయిల్ సాగుపై రైతులను చైతన్య వంతులను చేయండి: కలెక్టర్

అధిక లాభాలు ఇచ్చే పామాయిల్ సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజాప్రతినిథులను కోరారు. శుక్రవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ప్రత్యేకంగా పామాయిల్ సాగు వల్ల కలిగే లాభాలను కలెక్టర్ సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిథులకు వివరించారు. ప్రతి ఒక్క రైతు పామాయిల్ సాగుపై మరలేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.


