News March 22, 2025
విజయవాడ వైపు వెళ్లే రైళ్లు ఆలస్యం

నాయుడుపేట వద్ద సాంకేతిక లోపంతో మెమో ట్రైన్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దాని వెనుక వస్తున్న ట్రైన్స్ అన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘమిత్ర, హైదరాబాద్, సర్కార్, జైపూర్, బిట్రగుంట ఎక్స్ప్రెస్స్, ఛార్మినార్, గ్రాండ్ ట్రంక్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
Similar News
News November 24, 2025
మంచిర్యాల: ఓటు వేయడానికి రెడీనా..!

మంచిర్యాల జిల్లాలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఈ విధంగా కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 306 గ్రామపంచాయతీలు, 2,680 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 65, ఎస్సీ 81, బీసీ 23, జనరల్ 137 స్థానాలు కేటాయించారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.
News November 24, 2025
పాలమూరు: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

నారయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దాదాపు 4గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యేపై అని మాగునూరు పోలీసులు ఆయనతోపాటు బీఆర్ఎస్ నేతలు పలువురిపై కేసు నమోదు చేశారు.
News November 24, 2025
NGKL: జిల్లాలో గత ఐదు రోజులుగా తగ్గిన చలి..!

నాగర్కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజులుగా చల్లి తీవ్రత తగ్గుతుంది. చారకొండ మండలం సిర్సనగండ్లలో 18.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లి, అమ్రాబాద్ 18.7, వెల్దండ 18.8, ఎంగంపల్లి 19.0, తెలకపల్లి, కొండారెడ్డిపల్లి 19.1, నాగర్కర్నూల్, బిజినేపల్లి 19.3, కుమ్మెర 19.5, ఊర్కొండ 19.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.


