News October 9, 2024

విజయవాడ -శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు

image

దసరా పండగ సందర్భంగా ఈ నెల 9, 10, 11, 12, 14, 15 తేదీల్లో విజయవాడ-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు- విజయవాడకు ఈ నెల 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు తిరుగుతాయన్నారు. ఏలూరు, గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, విజయనగరం, చీపురుపల్లి, మీదుగా ఈ రైళ్లు ప్రయాణిస్తాయన్నారు.

Similar News

News October 28, 2025

ప.గో జిల్లాలో 583.8 మి.మీ. వర్షపాతం

image

గడిచిన 24 గంటల్లో జిల్లాలో 583.8 మి.మీల వర్షపాత నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సరాసరి 29.2 మి.మీ కాగా అత్యధికంగా యలమంచలిలో 53.6, నరసాపురంలో 49.6, పాలకొల్లులో 49.2, ఆచంటలో 43.8, మొగల్తూరులో 42.4 మి.మీలు నమోదయింది. అత్యల్పంగా గణపవరం 13.6 మి.మీ, తాడేపల్లిగూడెం 14.0, అత్తిలిలో 16.6 మి. మీ నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.

News October 28, 2025

తణుకు: ఇద్దరు డీఎస్పీలు ఒక్కటయ్యారు

image

ప.గో జిల్లా తణుకులో ఇద్దరు DSPల వివాహ మహోత్సవం జరిగింది. గతంలో చందోలు PSలో ట్రైనింగ్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ(స్వగ్రామం ప.గో(D) పాలంగి), పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. పోలీసు శాఖలో ఒకే క్యాడర్‌లో ఉన్న అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం.

News October 27, 2025

ప.గోలో ముంపు ప్రాంతాలివే!

image

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో అత్యంత ముప్పు ప్రాంతాలుగా 12 గ్రామాలను అధికారులు ప్రకటించారు. నరసాపురం పరివాహక ప్రాంతాలైన పేరుపాలెం నార్త్ , పేరుపాలెం సౌత్, కేపీపాలెం నార్త్, కేపీ పాలెం సౌత్, పెదమైన వాని లంక, చినమైన వాని లంక, దర్భరేవు, వేములదీవిఈస్ట్, వేములదీవి వెస్ట్, తూర్పు తాళ్లు, రాజులంక, బియ్యపుతిప్ప గ్రామాలను ప్రకటించారు. ఇక్కడే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు.