News February 22, 2025

విజయవాడ: శ్రీశైలంలో పర్యటించనున్న గవర్నర్ 

image

ఈనెల 24న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీశైలం వెళ్లనున్నట్లు విజయవాడలోని ఆయన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ దంపతులు 24న సాయంత్రం విజయవాడ నుంచి హెలికాఫ్టర్‌లో సున్నిపెంట వెళతారని, అనంతరం రాత్రి 8.45కి స్వామివారి దర్శనం ముగించుకుంటారని పేర్కొంది. 25వ తేదీ ఉదయం 11.20కి వారు విజయవాడ చేరుకుంటారని గవర్నర్ కార్యాలయం తెలిపింది. 

Similar News

News September 18, 2025

ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News September 18, 2025

శుభ సమయం (18-09-2025) గురువారం

image

✒ తిథి: బహుళ ద్వాదశి రా.12.25 వరకు
✒ నక్షత్రం: పుష్యమి ఉ.8.59 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: సా.5.29-సా.7.02
✒ అమృత ఘడియలు: ఉ.6.38-ఉ.8.10

News September 18, 2025

కానిస్టేబుల్ నుంచి టీచర్లుగా..

image

నందికొట్కూరు సర్కిల్ పరిధిలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఎస్.నాగ మల్లయ్య, ఎం.జ్యోతి డీఎస్సీలో ఉత్తీర్ణులై టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నాగ మల్లయ్య నందికొట్కూరు, జ్యోతి బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం వీరిని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం సన్మానించి, అభినందించారు.