News February 22, 2025
విజయవాడ: శ్రీశైలంలో పర్యటించనున్న గవర్నర్

ఈనెల 24న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీశైలం వెళ్లనున్నట్లు విజయవాడలోని ఆయన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ దంపతులు 24న సాయంత్రం విజయవాడ నుంచి హెలికాఫ్టర్లో సున్నిపెంట వెళతారని, అనంతరం రాత్రి 8.45కి స్వామివారి దర్శనం ముగించుకుంటారని పేర్కొంది. 25వ తేదీ ఉదయం 11.20కి వారు విజయవాడ చేరుకుంటారని గవర్నర్ కార్యాలయం తెలిపింది.
Similar News
News November 21, 2025
నడుము చుట్టుకొలత పెరిగితే డేంజరే

భారతీయుల శరీర నిర్మాణం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇతర దేశాలవారిలో ఒకే BMI ఉన్నా, భారతీయుల్లో కొవ్వు శాతం కాస్త అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భారతీయుల్లో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. పురుషుల్లో 35.4 అంగుళాలు, స్త్రీలలో 31.5 అంగుళాలు నడుము చుట్టుకొలత దాటితే అంతర్గత కొవ్వు పెరిగి డయాబెటీస్ వస్తుందంటున్నారు. దీనికోసం సమయానికి, సరైన ఆహారం మితంగా తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం చేయాలని సూచిస్తున్నారు.
News November 21, 2025
ఆ రూ.360 కోట్లు ఇవ్వాలి: రోజా

మామిడి రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని రోజా ఆరోపించారు. ‘చిత్తూరు జిల్లాలో 4.50లక్షల టన్నుల తోతాపురిని రైతులు ప్యాక్టరీలకు తోలారు. కిలోకు ప్రభుత్వం రూ.4, ప్యాక్టరీలు రూ.8 ఇస్తామని చెప్పారు. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం రూ.180కోట్లు ఇచ్చింది. ప్యాక్టరీలు రూ.8 కాకుండా రూ.4 చొప్పున ఇస్తున్నారు. ప్రభుత్వ మోసంతో రైతులు రూ.180 కోట్లు నష్టపోతారు. రూ.360 కోట్లు ఇచ్చేలా చూడాలి’ అని రోజా ట్వీట్ చేశారు.
News November 21, 2025
స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి.. రాజీనామా ప్రచారం?

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన నోటీసుకు MLA కడియం శ్రీహరి స్పందించారు. గడువు(23)కు ముందే ఆయన్ను కలిసి వివరణకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపై సభాపతి సానుకూలంగా స్పందించారు. మరోవైపు 2రోజుల్లో శ్రీహరి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు వేడిలోనే స్టేషన్ ఘన్పూర్లోనూ బైపోల్కు వెళ్లి BRSను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు చర్చ జరుగుతోంది.


