News November 18, 2024
విజయవాడ: RTC డ్రైవర్పై దాడి.. కేసు నమోదు

విజయవాడ కృష్ణలంకలో ఆదివారం సాయంత్రం RTC డ్రైవర్పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కృష్ణలంక సీఐ నాగరాజు స్పందిస్తూ.. డ్రైవర్ కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. RTC డ్రైవర్ బస్టాండ్ నుంచి తెనాలివైపు వస్తుండగా ఇనోవా కారులో ఉన్న వ్యక్తులు అడ్డగించి దాడి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం వారిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు.
Similar News
News November 29, 2025
నేడే కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సభ్యులు, అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో వివిధ అంశాలు, ఎంజెండాలపై చర్చ ఉంటుందని చెప్పారు.
News November 29, 2025
కృష్ణా: NMMS పరీక్షల హాల్ టికెట్లపై Update

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకులు కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inలో పొందుపరిచినట్లు DEO రామారావు తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ U-DISE కోడ్ ద్వారా లాగిన్ అయి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు.
News November 28, 2025
స్వమిత్వా సర్వేను వేగవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలో స్వమిత్వా సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి స్వమిత్వా సర్వే కార్యక్రమంపై సంబంధిత జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 250 గ్రామాలకు గాను 210 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందన్నారు.


