News February 15, 2025
‘విజయ తెలంగాణ’ రాసింది మన మేడ్చల్ మాజీ MLA

మేడ్చల్ అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే తూళ్ల దేవేందర్ గౌడ్ ‘విజయ తెలంగాణ’ పేరుతో పుస్తకం రాశారు. శుక్రవారం స్వయాన సీఎం రేవంత్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నేను చాలా అభిమానించే నాయకుల్లో దేవేందర్ గౌడ్ అగ్రస్థానంలో ఉంటారని కీర్తించారు.‘విజయ తెలంగాణ ఆయన స్వీయ చరిత్ర కాదు, తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజల కోణంలో పొందుపర్చిన పుస్తకం’ అని అన్నారు.
Similar News
News November 8, 2025
రాజోలిలో క్షుద్ర పూజలు కలకలం

రాజోలి మండల కేంద్రంలోని ఆర్డీటీ కాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇంటిని రేణుక శివశంకర్ దంపతులు అద్దెకు తీసుకొని ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రలో ఉన్నారు. సాయంత్రం ఇంట్లో నుంచి వచ్చి చూడగా ఇంటి గేటు ముందు ఒక బొమ్మపై పసుపు, కుంకుమ పడి ఉండడం చూసి హడలెత్తిపోయామని వారు అన్నారు. ఇదే ఇంట్లో గత నెల 28 తేదీన దొంగతనం జరిగింది.
News November 8, 2025
కొండాపూర్ శివారులో రోడ్డుప్రమాదం.. ఆటోడ్రైవర్ మృతి

మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అనుమల్ల గంగాధర్(55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 4న గంగాధర్ భీమారం నుంచి కొండాపూర్ వైపు ఆటోలో వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన గంగాధర్ను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. దీంతో కేసు నమోదైంది.
News November 8, 2025
ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

డిజిటల్, ఆన్లైన్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.


