News January 30, 2025
విజ్ఞాన శాస్త్రాన్ని ప్రయోగాత్మకంగా బోధించాలి:జిల్లా కలెక్టర్

విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రాన్ని ఆచరణాత్మక విధానం ద్వారా బోధిస్తే సులువుగా పట్టు సాధిస్తారని.. బాగా గుర్తు ఉండిపోతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన 116 సైన్స్ ఫెయిర్ కిట్లను ప్రభుత్వ పాఠశాలలకు కలెక్టర్ అందజేశారు. ఈ కిట్లను టీచర్లు సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు ప్రయోగాత్మక విధానంలో బోధించాలన్నారు.
Similar News
News October 16, 2025
నాగర్కర్నూల్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశం

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్థులను ఎలాంటి ఒత్తిడికి గురి చేయకూడదని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ అన్నారు. గురువారం నాగర్కర్నూల్ కలెక్టరేట్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్తో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన తెలిపారు.
News October 16, 2025
రసమయిపై MLA కవ్వంపల్లి ఫిర్యాదు..కేసు నమోదు

మానకొండూరు మాజీ MLA రసమయి బాలకిషన్ పంపిన బూతు పురాణం ఆడియో స్థానికంగా సంచలనం సృష్టించింది. అమెరికాలో ఉన్న రసమయి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వాట్సాప్కు రాయడానికి వీలులేని భాషలో పరుష పదజాలంతో కూడిన ఆడియో పంపారు. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, గాంధీభవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి సంగతి తేలుస్తానని హెచ్చరించారు. దీంతో కవ్వంపల్లి తిమ్మాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 16, 2025
WWC25: సెమీ ఫైనల్కు ఆస్ట్రేలియా

ఉమెన్స్ ODI WC-2025లో సెమీ ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇవాళ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత BAN 198/9 స్కోర్ చేయగా, AUS 24.5 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది. అలీసా హీలీ(113) సెంచరీతో మెరిశారు. లిచ్ఫీల్డ్(84) హాఫ్ సెంచరీ చేశారు. ఈ ఇన్నింగ్స్లో హీలీ 20 ఫోర్లు బాదడం విశేషం. కాగా భారత్పై మ్యాచులోనూ హీలీ(142) అద్భుత సెంచరీ చేశారు.