News January 30, 2025
విజ్ఞాన శాస్త్రాన్ని ప్రయోగాత్మకంగా బోధించాలి:జిల్లా కలెక్టర్

విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రాన్ని ఆచరణాత్మక విధానం ద్వారా బోధిస్తే సులువుగా పట్టు సాధిస్తారని.. బాగా గుర్తు ఉండిపోతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన 116 సైన్స్ ఫెయిర్ కిట్లను ప్రభుత్వ పాఠశాలలకు కలెక్టర్ అందజేశారు. ఈ కిట్లను టీచర్లు సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు ప్రయోగాత్మక విధానంలో బోధించాలన్నారు.
Similar News
News November 23, 2025
కార్తీకం వెళ్లినా.. తగ్గని కూరగాయల ‘ఘాటు’

కార్తీక మాసం ముగిసినా కూరగాయల ధరల జోరు మాత్రం తగ్గలేదు. రైతుబజార్లలో సైతం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మార్కెట్లో ఆకాకర రూ.130, చిక్కుడు రూ.110, వంకాయ, బీర రూ.70, టమాటా రూ.60 పలుకుతున్నాయి. ఇక బీన్స్ గింజలు ఏకంగా రూ.300కు చేరాయి. ధరల మోతతో కూరగాయలు కొనలేక పచ్చడి మెతుకులే గతి అవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
News November 23, 2025
చిత్తూరు: ఏనుగులను తరిమెందుకు ఏఐ నిఘా!

చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కారానికి అధికారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఏఐ కెమెరా, లౌడ్ స్పీకర్తో అనుసంధానం చేసి అమర్చి ఏనుగులు వచ్చినప్పుడు గుర్తించి లౌడ్ స్పీకర్ ద్వారా తుపాకుల శబ్దం చేసేలాగా అమర్చారు. చిత్తూరు సమీపంలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా సత్ఫాలితలు వచ్చాయి. దీంతో పలమనేరు, బైరెడ్డిపల్లి, వి.కోట, బంగారుపాలెంలో అమర్చేందుకు చర్యలు చేపట్టారు.
News November 23, 2025
ప.గో: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లేఅవుట్లలోని ఖాళీ ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్లో అప్డేట్ చేయాలన్నారు. పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాల్లో డేటా ఎంట్రీ ప్రారంభమైందని, మిగిలిన చోట్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాన్నారు.


