News April 5, 2025

విడదల రజినికి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం: అడ్వకేట్ జనరల్

image

స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి, డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి రజిని, ఆమె మరిది గోపికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదించారు. ACB వేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రజిని వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కేసులో రాజకీయ కారణాలు ఉన్నాయని రజని తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, మహేశ్వర రెడ్డి వాదించారు.

Similar News

News October 30, 2025

ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక.!

image

మెంథా తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా, కృష్ణా నది ఉపనదులలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో కృష్ణా నదికి వేగంగా వరదలు వస్తున్నట్లు రివర్ కన్జర్వేటర్-కృష్ణ & ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో నేడు 6,00,000 క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని, వరద వేగంగా పెరుగుతోందని చెప్పారు. అన్ని విభాగాలు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 30, 2025

గుంటూరు జిల్లాను ముంచెత్తిన వాన

image

మొథా తుపాన్‌ ప్రభావంతో గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిశాయి. కాకుమానులో అత్యధికంగా 116.6 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదనందిపాడు 114.6, ప్రత్తిపాడు 109.4, చేబ్రోలు 91.4, కొల్లిపర 78.4, వట్టిచెరుకూరు 76.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తాడేపల్లి, దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురవడంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాలు నీటమునిగాయి.

News October 30, 2025

GNT: తుపాను ప్రభావంతో తగ్గిన ఆర్టీసీ ఆదాయం

image

మొంథా తుపాను కారణంగా మంగళ, బుధవారాల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీ దెబ్బ తగిలింది. సాధారణంగా రోజుకు రూ.73 లక్షల వసూళ్లు వచ్చే గుంటూరు జిల్లాలో మంగళవారం రూ.41 లక్షలు, బుధవారం రూ.25 లక్షలకే పరిమితమైంది. జాగ్రత్త చర్యగా అనేక రూట్లలో సర్వీసులు నిలిపివేశారు. శ్రీశైలం, హైదరాబాద్, బెంగళూరు రూట్లు తాత్కాలికంగా రద్దు కాగా, గురువారం నుంచి మిగిలిన మార్గాల్లో బస్సులు మళ్లీ నడవనున్నాయి.