News October 27, 2024

విడపనకల్: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

image

అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని హవళిగి గ్రామానికి చెందిన వరలక్ష్మి, పెన్నయ్య దంపతులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఈ క్రమంలో వరలక్ష్మి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News December 9, 2025

వాహనదారులారా.. రూల్స్ అతిక్రమించకండి: ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. వాహనదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వేగం, ప్రమాదకర డ్రైవింగ్, మద్యం మత్తు, నిద్రమత్తు డ్రైవింగ్‌ను పూర్తిగా నివారించాలన్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రోడ్డు సంకేతాలను వాహనదారులు కచ్చితంగా పాటించాలన్నారు. బండి పత్రాలు ఉండాలని, హెల్మెట్/సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడలని, లేనిచో చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు.

News December 9, 2025

అనంత జిల్లాలో యువకుడి దారుణ హత్య

image

అనంతపురం(D) బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలోని వీరభద్ర కాలనీకి చెందిన సాయిచరణ్(23) దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి చరణ్ స్నేహితులే పొలంలో కొట్టి చంపి, అనంతరం బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌‌లో విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 9, 2025

అనంత: పోలీసుల PGRSకు 128 పిటిషన్లు.!

image

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన PGRSకు ప్రజల నుంచి 128 పిటిషన్లు వచ్చినట్లు జిల్లా SP జగదీశ్ తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరానికి సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులు పంపించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.