News April 7, 2024

విడుదల రజనీ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు

image

గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థి విడుదల రజనీ ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారని ముస్లిం సేనా రాష్ట్ర అధ్యక్షులు షేక్ సుభాని తెలిపారు. ఎన్నికల కోడ్‌కి విరుద్ధంగా మసీదులలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ ఎన్నికల అధికారి రాజ్యలక్ష్మిని షేక్ సుభాని శనివారం కలిసి ఫిర్యాదు చేశారు. రజినీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News January 20, 2025

గుంటూరు: తల్లీబిడ్డ మృతి.. ‘ఆచూకీ తెలిస్తే ఈ నంబర్లలో తెలపండి’

image

గుంటూరులోని బుడంపాడు వద్ద బిడ్డతో సహా తల్లి <<15198194>>రైలు కింద పడిన<<>> ఘటన కలిచివేసింది. అభంశుభం తెలియని తెలియని ఆ చిన్నారి రైల్వే ట్రాక్‌పై విగత జీవిగా పడి ఉండటం స్థానికుల కళ్లు చెమర్చింది. ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంది అంటూ ఆవేదన చెందారు. అయితే వీరి వివరాలు తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు గుంటూరు జీఆర్పీ ఎస్సై 8328018787, పోలీస్ స్టేషన్ 0863 222073 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

News January 20, 2025

వేమూరులో పురుగు మందు తాగి విద్యార్థిని మృతి

image

పురుగు మందు తాగి విద్యార్థిని మృతి చెందిన ఘటన వేమూరు అంబేడ్కర్ నగర్‌లో చోటుచేసుకుంది. అంబేడ్కర్ నగర్‌కు చెందిన బుస్సా రాము రెండవ కుమార్తె మేఘన ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతుంది. మేఘనకు తరచు కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తల్లిదండ్రులు వైద్య చికిత్స కోసం తెనాలి వైద్యశాలకు తరలించగా ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ రవి క్రిష్ణ తెలిపారు.

News January 20, 2025

గుంటూరులో నేటి నుంచి పశు వైద్య శిబిరాలు

image

ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఓ.నరసింహారావు వెల్లడించారు. ఈ మేరకు శిబిరానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మీ ఆవిష్కరించారని తెలిపారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ప్రతీ మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.