News March 11, 2025
విదేశాలకు వెళ్లే వారి కోసమే హెల్ప్ డెస్క్ ఏర్పాటు: కలెక్టర్

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్లే తమ కుటుంబాలను పోషించుకోవలసిన వారికి అన్ని విధాలా సౌకర్యవంతమైన సేవలందించేందుకు అమలాపురం కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్ను కలెక్టర్ జిల్లా ఎస్పీ కృష్ణారావు, జేసీ ప్రశాంతి, వీఆర్వో రాజకుమారి, ఆర్డీవోలు మాధవి, శ్రీకర్, అఖిలతో కలిసి ప్రారంభించారు.
Similar News
News March 19, 2025
సునీత గురించి ఈ విషయాలు తెలుసా?

సునీతా విలియమ్స్ 1987లో అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టమ్ కమాండర్, డైవింగ్ ఆఫీసర్, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్గా పని చేశారు. మధ్యదరా, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రంలో డ్యూటీ చేశారు. ఎన్నో భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవాన్ని గడించారు. 1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో ISSకు వెళ్లారు. 2007లో స్పేస్లో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
News March 19, 2025
సునీత విషయంలో రాజకీయం!

సునీత, విల్మోర్ 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా బోయింగ్ స్టార్ లైనర్లో సమస్యలతో అక్కడే ఉండిపోయారు. అప్పటికే బోయింగ్ కంపెనీకి చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ప్రతిష్ఠాత్మకమైన ఇలాంటి యాత్రలకు బైడెన్ సర్కార్ ఆ కంపెనీనే సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఎలాన్ మస్క్ ట్రంప్ అధికారంలోకి రాకముందు వారిని తీసుకొస్తే బైడెన్కు మైలేజీ పెరుగుతుందని ఆలస్యం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
News March 19, 2025
పుంగనూరులో 32 మంది కానిస్టేబుళ్ల బదిలీ

పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో కానిస్టేబుళ్లను భారీగా బదిలీ చేశారు. ఏకంగా 32 మందిని బదిలీ చేస్తూ చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఇద్దరినీ వీఆర్కు బదిలీ చేశారు. బదిలీ అయిన సిబ్బందిని వెంటనే రిలీవ్ చేయాలని.. కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో రిపోర్ట్ చేయాలని ఎస్పీ ఆదేశించారు.