News September 25, 2024
విదేశీ సంస్థల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి భేటీ

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. యూకే, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ సంస్థ ప్రతినిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అవకాశాలపై చర్చించారు. రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల నియంత్రణ కార్యకలాపాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణ అంశాలపై మాట్లాడినట్లు మంత్రి తెలిపారు.
Similar News
News January 8, 2026
నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించండి: SP

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నేర సమీక్షను నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. అన్ని కేసుల్లో ఈ-సాక్ష్య యాప్ వినియోగం, సీసీటీఎన్ఎస్లో వివరాల అప్లోడ్ తప్పనిసరి అన్నారు. ఎన్బీడబ్ల్యూ అమలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలన్నారు.
News January 8, 2026
వెట్టిచాకిరీ పూర్తిగా నిర్మూలించాలి: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలో ఎక్కడా.. ఏ రూపంలోనూ వెట్టిచాకిరీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి వెట్టిచాకిరీ నిఘా, పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. పిల్లలు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో వెట్టిచాకిరీకి తావులేకుండా నిఘా పెంచాలని ఆయన సూచించారు. వెట్టి నుంచి విముక్తి చేసిన వారికి బ్యాంకులు, DRDA ద్వారా ఆర్థిక సహాయం అందించి జీవనాధారం కల్పించాలన్నారు.
News January 8, 2026
వెట్టిచాకిరీ పూర్తిగా నిర్మూలించాలి: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలో ఎక్కడా.. ఏ రూపంలోనూ వెట్టిచాకిరీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి వెట్టిచాకిరీ నిఘా, పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. పిల్లలు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో వెట్టిచాకిరీకి తావులేకుండా నిఘా పెంచాలని ఆయన సూచించారు. వెట్టి నుంచి విముక్తి చేసిన వారికి బ్యాంకులు, DRDA ద్వారా ఆర్థిక సహాయం అందించి జీవనాధారం కల్పించాలన్నారు.


