News March 26, 2025

విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన.. ప్రిన్సిపల్‌పై పోక్సో కేసు

image

గోరంట్లలోని నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మిపతిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన గిరిజన సంఘాల నాయకులు పోలీసులను కలిసి పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ రత్న కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News December 29, 2025

జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పూల నాగరాజు

image

అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పూల నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం ఉదయం అధ్యక్షుడిగా పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరిలు బాధ్యతలు స్వీకరించారు. వారిని ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News December 28, 2025

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఛైర్మన్‌గా ఆదెన్న

image

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఛైర్మన్‌గా రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రభుత్వం ఆదెన్న పేరును సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు పంపారు. శనివారం రాత్రి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. సుమారు 20 ఏళ్లపాటు TDP లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఆదెన్న పనిచేశారు. అనంతపురంలో స్థిరపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

News December 28, 2025

అనంత: భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గుత్తి పట్టణంలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260. అనంతపురంలో రూ.220, స్కిన్ లెస్ రూ.260. గుంతకల్లులో రూ.220, స్కిన్లెస్ రూ.240గా విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మటన్ రూ.750లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఒక్కసారి ఇలా చికెన్ ధరలు పెరగడంతో మాంసం ప్రియులు అయోమయంలో పడ్డారు.