News March 26, 2025

విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన.. ప్రిన్సిపల్‌పై పోక్సో కేసు

image

గోరంట్లలోని నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మిపతిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన గిరిజన సంఘాల నాయకులు పోలీసులను కలిసి పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ రత్న కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News October 22, 2025

ఎర్రచందనం అనుకొని తనిఖీలు.. తీరా చూస్తే సండ్ర మొద్దులు..!

image

యాడికి మండలం మీదుగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొలిమిగుండ్ల నుంచి బుగ్గ మీదుగా యాడికికి వస్తున్న ఐచర్ వాహనాన్ని సీఐ ఈరన్న తన సిబ్బంది నిలిసి తనిఖీ చేవారు. అయితే అవి సండ్ర మొద్దులు అని గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది.

News October 22, 2025

ALL THE BEST

image

బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం నీరజ తెలిపారు. చంద్రగిరిలో జరిగే అండర్-14 విభాగంలో బిందు, నందు, లక్ష్మి, కడపలో జరిగే అండర్-17 విభాగంలో జగదీశ్వరి ఎంపికయ్యారు. క్రీడాకారులను పీడీ గట్టు నాగరాజు, ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, కోటేశ్వరప్ప, బాలకృష్ణ, ఉమ, లలిత, వెంకటలక్ష్మి, మధుమాల, కమల, సువర్ణ అభినందించారు.

News October 22, 2025

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

image

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంబదూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టు కోసం 4,292.28 ఎకరాలు గుర్తించామని, పెండింగ్‌లో ఉన్న 984.53 ఎకరాల భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.