News February 22, 2025
విద్యార్థిని అశ్లీల చిత్రాలతో వ్యాపారం.. నిందితుల అరెస్టు

విద్యార్థిని వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, పోర్న్ సైట్లలో సొమ్ము చేసుకుంటున్న ఇద్దిరిని శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ తెలిపారు. నగరానికి చెందిన ఓ విద్యార్థిని తిరుపతిలో చదువుతున్న సమయంలో సోయల్ పరిచయమయ్యాడు. ఆమెకు తెలియకుండా తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి, కొత్త నంబర్లతో పంపుతూ వేధించేవాడు. ఆ వీడియోలు చూసేందుకు సోయల్ నుంచి క్యూఆర్ కొనుగోలు చేసిన నందికొట్కూరుకు చెందిన రఘును కూడా అరెస్టు చేశారు.
Similar News
News February 23, 2025
కర్నూలు జిల్లాలో కిలో చికెన్ ఎంతంటే?

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇవాళ కిలో చికెన్ రూ.180-200 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.400, మటన్ కిలో రూ.750-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
News February 23, 2025
కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
News February 22, 2025
కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

➤ విద్యార్థిని అశ్లీల చిత్రాలతో వ్యాపారం.. నిందితుల అరెస్టు. ➤ కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు గురు భక్తి ఉత్సవాల ఆహ్వాన పత్రిక. ➤ వలసలు వెళ్లకుండా పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు. ➤ జాతీయ స్థాయి స్కాలర్షిప్లో కోసిగి విద్యార్థుల ప్రతిభ. ➤ వరి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న విదేశీ పర్ఫాల్ స్వాపెన్ పక్షులు. ➤ కర్నూలు: రెండుసార్లు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ➤ జిల్లాలో రెచ్చిపోతున్న హిజ్రాలు.