News March 24, 2025
విద్యార్థిని తండ్రి నిర్ణయం.. అధికారులను కదిలించింది..

ఓ విద్యార్థిని తండ్రి పట్టుదల కారణంగా ఓ స్కూల్ మూతపడకుండా నడుస్తోంది. వైరా మం. నారపునేనిపల్లి స్కూల్లో కోతుల బెడద, ఇతర కారణాలతో విద్యార్థులు వెళ్లిపోయారు. దీంతో స్కూల్ మొత్తంలో నాలుగో తరగతి విద్యార్థి కీర్తన మాత్రమే మిగిలింది. అధికారులు స్కూల్ను మూసివేసేందుకు యత్నించగా.. తన కుమార్తె చదువు మాన్పిస్తానని కీర్తన తండ్రి అనిల్శర్మ చెప్పారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలనడంతో వెనక్కి తగ్గారు.
Similar News
News April 1, 2025
ఖమ్మం: కోట మైసమ్మ తల్లిని దర్శించుకున్న అసిస్టెంట్ కమిషనర్

కామేపల్లి మండలం కొత్తలింగాల కోటమై సమ్మ దేవాలయంలో అమ్మవారిని ఖమ్మం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీర స్వామి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిషనర్కు ఈవో నల్లమోతు శేషయ్య, జూనియర్ అసిస్టెంట్ బి.వరప్రసాద్, అర్చకులు బాచి మంచి పుల్లయ్య శర్మ సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. భక్తులు, గ్రామస్థులు విరివిగా పాల్గొన్నారు.
News March 31, 2025
KMM: రంజాన్ వేడుకల్లో డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీలో గల మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ ఉద్దీన్ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరీ సోదరీమణులకు భట్టి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News March 31, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆}ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పెనుబల్లి నీలాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన