News February 14, 2025
విద్యార్థి మృతిపై నివేదిక ఇవ్వండి: బాలల హక్కుల కమిషన్

మధురవాడ లో ఇంటర్ విద్యార్థి మేడపై నుంచి దూకి మృతి చెందిన ఘటనపై పోలీస్, ఇంటర్ విద్యాశాఖ అధికారులు నివేదిక అందించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒత్తిడి వల్ల చనిపోయాడా, ఇతర కారణాలు వల్ల చనిపోయామా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
Similar News
News February 21, 2025
విశాఖ: వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్షా నిర్వహించారు. మాతృ, శిశు మరణాలు నమోదు కాకుండా చర్యలు చేప్పట్టాలన్నారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటివి రాకుంగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష జరిపి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. DMHO జగదీశ్వర రావు ఉన్నారు.
News February 20, 2025
విశాఖ టుడే టాఫ్ న్యూస్

☞ విశాఖ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు ☞గంజాయి తాగినా రౌడీషీట్: విశాఖ DIG ☞కనకమహాలక్ష్మి సేవలో విదేశీ యువతులు ☞విశాఖ: VRS చేస్తే రూ.50 లక్షలు..! ☞ రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ ధర్నా ☞విశాఖలో డివైడర్ను ఢీకొట్టిన కారు ☞విశాఖ: జనారణ్యంలోకి వచ్చిన దుప్పి ☞హైదరాబాద్లో విశాఖ యువకుడి మృతి ☞ఆనందపురం: ఆవు పొట్టలో 50 కేజీల ప్లాస్టిక్ ☞విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు
News February 20, 2025
విశాఖ: తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. మాస్ కాపీయింగ్ లేదా ఇతర సంఘటనలు జరిగాయని పేర్కొంటూ ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు వార్తలను, సమాచారాన్ని చేరవేసే వారిపై నిఘా ఉంటుందన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.