News August 8, 2024

విద్యార్థులకు అలర్ట్: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీపీఈడీ, ఎంపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 19 నుంచి 22 తేదీల మధ్య ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

Similar News

News April 17, 2026

క్రీడాకారులకు ‘శాప్’ అండగా ఉంటుంది: భరణి

image

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఎండీ ఎస్. భరణితో కృష్ణా జిల్లా టైక్వాండో అసోసియేషన్ కోశాధికారి అశ్విని గోగులమూడి, సభ్యురాలు సరితా దేవి శుక్రవారం భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన పారా జాతీయ టైక్వాండో పోటీలలో రాష్ట్ర క్రీడాకారులు ప్రశాంత్, షణ్ముఖ్ సాధించిన విజయాలను వారు ఎండీకి వివరించారు. క్రీడాకారుల ప్రతిభను అభినందించిన భరణి, వారికి శాప్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News April 17, 2026

పునాదికే రూ. 50 లక్షలు స్వాహా.. బందరు MP షాక్!

image

మచిలీపట్నం బలరాముని పేటలో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణం వివాదస్పదమైంది. MP బాలశౌరి మంజూరు చేసిన రూ. 50 లక్షల నిధులను నిర్వాహకులు కేవలం పునాది (ఫౌండేషన్) కోసమే ఖర్చు చేయడంతో ఆయన విస్మయానికి గురయ్యారు. దీనిపై నివేదిక కోరినా స్పందన లేకపోవడంతో MP తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వైరం పెరుగుతుందనే ఆందోళనతో లోలోన మదనపడుతూ మౌనం వహిస్తున్నట్లు సమాచారం.

News April 17, 2026

పునాదికే రూ. 50 లక్షలు స్వాహా.. బందరు MP షాక్!

image

మచిలీపట్నం బలరాముని పేటలో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణం వివాదస్పదమైంది. MP బాలశౌరి మంజూరు చేసిన రూ. 50 లక్షల నిధులను నిర్వాహకులు కేవలం పునాది (ఫౌండేషన్) కోసమే ఖర్చు చేయడంతో ఆయన విస్మయానికి గురయ్యారు. దీనిపై నివేదిక కోరినా స్పందన లేకపోవడంతో MP తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వైరం పెరుగుతుందనే ఆందోళనతో లోలోన మదనపడుతూ మౌనం వహిస్తున్నట్లు సమాచారం.