News March 16, 2025
విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చేప్పిన పల్నాడు కలెక్టర్

జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. జిల్లాలో 463 పాఠశాల నుంచి మొత్తం 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలలో బాలురు 13,415 మంది బాలికలు 1,382 మంది ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. జిల్లాలోని విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
Similar News
News September 18, 2025
వాహన మిత్ర’’ కు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఆటో, మాక్సీ క్యాబ్ వాహన యజమానులు ‘‘వాహన మిత్ర’’ పథకం కోసం సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కార్డ్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు.
News September 18, 2025
జగిత్యాల: తండ్రి మందలించాడని కుమారుడి సూసైడ్

జగిత్యాలలోని విద్యానగర్కు చెందిన రాహుల్ (బీటెక్ విద్యార్థి) కొంత కాలంగా ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడుతూ దానికి బానిసయ్యాడు. ఈ విషయం గమనించిన తండ్రి శ్రీనివాస్ మందలించడంతో రాహుల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 18, 2025
కలెక్టర్ను కలిసిన రాజమహేంద్రవరం జైల్ సూపరింటెండెంట్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరిను గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జైళ్లలో పరిస్థితిని ఆమెకు వివరించారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ది పథంలో నడపాలని కలెక్టర్ అన్నారు.