News February 18, 2025

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: అడిషనల్ కలెక్టర్

image

విద్యార్థులకు విద్యతోపాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కామన్ మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కృతమూర్తికి ఆయన సూచించారు.

Similar News

News October 30, 2025

NGKL: రేపు ‘డయల్‌ యువర్ డీఎం’

image

రేపు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డీఎం యాదయ్య తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలు 9959226288కు కాల్ చేసి తమ సలహాలు, సూచనలు తెలియజేయాలని ఆయన సూచించారు.

News October 30, 2025

అజహరుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు: భట్టి

image

TG: దేశ క్రికెట్‌కు సేవలందించిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తే వ్యతిరేకించడం సరికాదని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. దీనిని స్వాగతించకుండా ECకి <<18147731>>లేఖ<<>> రాయడం దారుణమని చెప్పారు. రాష్ట్రంపై ప్రేమ ఉన్నవారు అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించరని మండిపడ్డారు. దీనిపై BJP, BRS కలిసే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. మైనార్టీ అన్న ద్వేషంతోనే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటున్నారన్నారు.

News October 30, 2025

227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం: కలెక్టర్

image

ఖమ్మం నగరంలో మున్నేరు నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో 90 కుటుంబాల పరిధిలో 227 సభ్యులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వారికి అవసరమైన ఆహారం, పారిశుధ్యం, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఆస్తి నష్టం, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. తుపాన్ వల్ల 24 రోడ్లపై నీటి ప్రవాహం రావడం వల్ల రాకపోకలు నిలిపి వేశామని పేర్కొన్నారు.