News February 15, 2025

విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.

Similar News

News November 22, 2025

HYD: వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరం: సీపీ

image

వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన పోలీస్ సిబ్బంది కోసం నిర్వహిస్తున్న పాతబస్తీ పేట్ల బురుజు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరమన్నారు.

News November 22, 2025

వైభవంగా రామయ్య నిత్య కళ్యాణ వేడుక

image

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం సీతారామచంద్ర స్వామికి అత్యంత వైభవోపేతంగా నిత్య కళ్యాణ వేడుకను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అంతరాలయంలో స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. వేదమంత్రాల నడుమ స్వామివారిని నిత్య కళ్యాణం మండపంలో వేయించేసి నిత్య కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

News November 22, 2025

MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అండర్-14 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (MDCA) రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. ఈనెల 24న మహబూబ్ నగర్‌లోని క్రికెట్ స్టేడియంలో (పిల్లలమర్రి) ఎంపికలు ఉంటాయని, 1.9.2011 తర్వాత జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, ఫొటోలతో హాజరు కావాలన్నారు.
#SHARE IT.