News February 15, 2025

విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.

Similar News

News December 9, 2025

రాంబిల్లి: ఆరుగురు విద్యార్థులు అదృశ్యం

image

రాంబిల్లి మండలం వెంకటాపురంలో భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా వీరి ఆచూకీ లభించలేదు. దీంతో ట్రస్ట్ యాజమాన్యం రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి ఆచూకీ కోసం రాంబిల్లి పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థులు స్కూలు నుంచి ఎందుకు వెళ్లిపోయారో తెలియాల్సి ఉంది.

News December 9, 2025

ములుగు: ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది!

image

జిల్లాలో ఇసుక లారీల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది వికలాంగులుగా మారి రోడ్డున పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న ఇసుక లారీల నియంత్రణ లేకపోవడం శాపంగా మారిందని జిల్లా వాసులు వాపోతున్నారు. నిత్యం ఇసుక లారీల ప్రమాదాల్లో ప్రాణాలు పోతూనే ఉన్నా లారీల వేగానికి అదుపు లేకుండా పోతుంది. ఇకనైనా ప్రభుత్వం, పాలకులు ఇసుక లారీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

News December 9, 2025

ములుగు: ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది!

image

జిల్లాలో ఇసుక లారీల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది వికలాంగులుగా మారి రోడ్డున పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న ఇసుక లారీల నియంత్రణ లేకపోవడం శాపంగా మారిందని జిల్లా వాసులు వాపోతున్నారు. నిత్యం ఇసుక లారీల ప్రమాదాల్లో ప్రాణాలు పోతూనే ఉన్నా లారీల వేగానికి అదుపు లేకుండా పోతుంది. ఇకనైనా ప్రభుత్వం, పాలకులు ఇసుక లారీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.