News December 10, 2024
విద్యార్థులకు భారంగా మారిన దోస్త్ను ఎత్తివేయాలి: పీడీఎస్యూ

రాష్ట్రంలో విద్యార్థులకు భారంగా మారిన దోస్త్ విధానాన్ని ఎత్తేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొ.పురుషోత్తమ్కు విద్యార్థి నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ విధానంలో లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన అవగాహన లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News September 16, 2025
HYD: బదులేనిదీ ప్రశ్న.. పిల్లలకెందుకీ శిక్ష?

ఓల్డ్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ చేస్తుండటంతో పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యజమాని చేసిన తప్పుకు అతడిని శిక్షించి పాఠశాల నిర్వహణను వేరేవారికి ఇవ్వవచ్చు కదా అనేది తల్లిదండ్రుల ప్రశ్న. జరిగింది ముమ్మాటికీ తప్పే.. దీనికి విద్యార్థులను ఎందుకు శిక్షించడం అనేది తల్లిదండ్రుల వర్షన్. అధికారులేమో ప్రత్యామ్నాయం చూపిస్తాం అంటున్నారు.
News September 16, 2025
మియాపూర్: డ్యూటీలో గుండెపోటుతో కండక్టర్ మృతి

మియాపూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కండక్టర్ పండరి గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. సహోద్యోగులతో సరదాగా మాట్లాడుతూ పండరి వాష్రూమ్కి వెళ్లొస్తానని వెళ్లాడు. వెంటనే అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో సహోద్యోగులు అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు.
News September 16, 2025
HYD: పర్మిషన్ ఇస్తే సరిపోతుందా? తనిఖీలు..!

ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ వ్యవహారం సిటీలో కలకలం రేపింది. ప్రైవేట్ స్కూళ్లలో దందా జరుగుతోంటే అధికారులు ఏం చేస్తున్నారో? సిటీలో అసలు ప్రైవేట్ బడులను విద్యాశాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ ఇచ్చాం.. అయిపోయింది.. అసలేం జరుగుతోందనే విషయం ఆలోచించడం లేదు. అందుకే ఈ దౌర్భాగ్యం అని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరేం అంటారు?