News February 4, 2025

విద్యార్థులకు షీ టీంపై అవగాహన కల్పించిన పోలీసులు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం పోలీసుల ఆధ్వర్యంలో రంగంపేట్‌లోని ఓ అకాడమీ విద్యార్థులకు షీ టీం పని తీరుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి, అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, ఉమెన్ ట్రాఫికింగ్, వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలపై షీ టీం పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Similar News

News December 13, 2025

ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు: కలెక్టర్

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.

News December 13, 2025

రేపు వరంగల్‌లో టఫ్ ఫైట్..!

image

జిల్లాలో 117 పంచాయతీలకు ఆదివారం జరిగే రెండో విడతపై ఉత్కంఠ నెలకొంది. దుగ్గొండి 33, గీసుగొండ 19, నల్లబెల్లి 29, సంగెం 30 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. 117 జీపీలకు ఇప్పటికే 5 ఏకగ్రీవమయ్యాయి. నల్లబెల్లి, దుగ్గొండిలో ఎన్నికలపై BRS, కాంగ్రెస్ నేతలు నువ్వా నేనా? అన్నట్లు ఉండగా, గీసుగొండలో కొండా కాంగ్రెస్, రేవూరి కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. సంగెంలో పాగా వేసేందుకు చల్లా, రేవూరి వర్గాల మధ్య ఆసక్తికర పోటీ ఉంది.

News December 12, 2025

వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కొత్త సమీకరణలు!

image

WGL తూర్పు కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. జిల్లా అధ్యక్షుడి మార్పుతో సమీకరణాలు మారిపోతుండగా, కొండా దంపతుల అనుచరుడి ఇంట్లో నేతల మధ్య అంతర్గత చర్చలు జరిగాయి.సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ఒక్కటైన తూర్పు నేతలు జిల్లా పార్టీ పదవులపై మంతనాలు జరిపినట్లు సమాచారం. నల్గొండ రమేశ్ ఇంట్లో మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సారయ్య భేటీ అయ్యారు. కీలక నేతలు త్వరలో రాష్ట్ర అధిష్టానాన్ని కలవనున్నట్లు తెలుస్తోంది.