News December 14, 2024
విద్యార్థులతో భోజనం చేసిన మంత్రి తుమ్మల

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలను సందర్శించారు. నూతన మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టూడెంట్స్ కు నాణ్యమైన భోజనం అందించాలని మెస్ ఛార్జీలు రెట్టింపు చేశామన్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నారు. వారితో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఉన్నారు.
Similar News
News March 11, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

✓:వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ✓:ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ✓:నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం✓:ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ✓:వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన✓:ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు✓:పెనుబల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ✓:మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News March 11, 2025
విజయవంతంగా ముగిసిన LRS అవగాహన సెమినార్

ఖమ్మం జిల్లాలో LRSపై ఏర్పాటు చేసిన అవగాహన సెమినార్ విజయవంతంగా ముగిసిందని జిల్లా రిజిస్ట్రార్ ఎం. రవీందర్ రావు తెలిపారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో LRSపై అవగాహన సెమినార్ను నిర్వహించారు. LRSపై సభ్యులు అడిగిన వివిధ సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేశామని చెప్పారు. LRSకు సంబంధించి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచే సినట్లు జిల్లా రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
News March 11, 2025
ఖమ్మం: ప్రీ బడ్జెట్పై డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం

డా.బీ.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల అధికారులతో సహచర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం ప్రీ బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా బడ్జెట్ రూపొందించాలని చర్చించారు.