News February 8, 2025

విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న MHBD కలెక్టర్

image

గూడూరులో కేజీబీవీ ఆశ్రమ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు వండిన వంటలను పరిలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను సంబధిత వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూమ్‌లలోకి వెళ్లి విద్యార్థులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమకు విద్యార్దులు తమకు తెలపాలన్నారు.

Similar News

News February 9, 2025

VZM: ‘అనుమతులు లేకుండా పశు మాంసం విక్రయించొద్దు’

image

విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సు‌తో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసాన్ని విక్రయించాలని, అనుమతులు లేకుండా పశువులను వధించడం, రవాణా చేయడం చట్ట ప్రకారం నేరమన్నారు. చట్ట వ్యతిరేకంగా పశువుల వధించడం, రవాణా చేసినట్లయితే వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు.

News February 9, 2025

తూ.గో: 26 మంది ఉద్యోగులకు షాకోజ్ నోటీసులు

image

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 26 మంది ఉద్యోగులకు శనివారం కలెక్టర్ షాకోజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో 12 మంది డిప్యూటీ తహశీల్దార్లు , 12 మంది మండల సర్వేయర్లు, ఇద్దరు గ్రామ సర్వేయర్లు ఉన్నారు. రాజమండ్రి రూరల్, పెరవలి, గోపాలపురం, చాగల్లు, గోకవరం, కడియం, దేవరపల్లి, నల్లజర్ల, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల డిప్యూటీ తహశీల్దార్లు ఉన్నారు.

News February 9, 2025

బాపట్ల: 12 మద్యం షాపులకు 159 దరఖాస్తులు

image

బాపట్ల జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 12 మద్యం షాపులకు 159 దరఖాస్తులు వచ్చినట్లు బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి దేవదత్తు తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని, పదో తేదీన బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయిస్తామన్నారు. దరఖాస్తుదారులు 10వ తేదీ ఉదయం 8 గంటలలోపు హాజరుకావాలని సూచించారు.

error: Content is protected !!