News February 17, 2025

విద్యార్థులు ఇష్టంతో చదవాలి.. కష్టంతో కాదు: కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులు ఇష్టంతో చదవాలని, కష్టంతో కాదని ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రతి ఏడాది వలే ఈ ఏడాది కూడా పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ కోరారు.  మై స్కూల్ -మై ప్రైడ్‌పై హెచ్ఎం, టీచర్స్‌తో కలెక్టర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News October 25, 2025

వనపర్తిలో భారీ వర్షాలు.. విలియంకొండలో 101.8 మి.మీ.

image

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8:30AM నుంచి శనివారం ఉదయం 8:30AM) భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విలియంకొండలో 101.8 మి.మీ. వర్షం కురిసింది. ఏదుల 69.5 మి.మీ., పెద్దమందడి 57.5 మి.మీ., గోపాల్‌పేట 54.3 మి.మీ., మదనాపురంలో 52.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

News October 25, 2025

అంతర పంటలతో వ్యవసాయంలో అధిక లాభం

image

ప్రధాన పంట వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలం వృథా కాకుండా పండించే మరో పంటను అంతర పంట అంటారు. ఈ విధానంలో ఒక పంట దెబ్బతిన్నా.. మరొకటి చేతికొస్తుంది. వాతావరణం అనుకూలిస్తే 2 పంటల నుంచి రైతు మంచి ఆదాయం పొందవచ్చు. దీని వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద, నేలకోత తగ్గి.. భూమిలో పోషకాలు పెరిగే అవకాశం ఉంది. అంతర పంటల సాగు వల్ల వచ్చిన ఆదాయం ప్రధాన పంట పెట్టుబడికి సహాయపడుతుంది.

News October 25, 2025

జన్నారం: కూతురితో తల్లి సూసైడ్.. కారణం ఇదే..!

image

జన్నారం మందపల్లిలో <<18091156>>కూతురితో తల్లి<<>> ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్సై అనూష ప్రకారం.. మందపల్లి వాసి శ్రావణ్ జగిత్యాల జిల్లా వాసి స్పందనను పెళ్లి చేసుకున్నాడు. వారికి 3ఏళ్ల మోక్షశ్రీ, 11 నెలల వేదశ్రీ ఉన్నారు. 6 నెలలుగా స్పందన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో కుటుంబీకులు జాగ్రత్తగా కనిపెడుతున్నారు. శుక్రవారం 11 నెలల వేదశ్రీతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.