News March 20, 2025

విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

రేపటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు వ్రాయాలని సూచించారు. విద్యార్థులు సంవత్సర కాలం పాటు ఉపాధ్యాయుల శిక్షణలో ఎంతో శ్రమించి, పట్టుదలతో ఈ దశకు చేరుకుని పూర్తి స్థాయిలో సన్నదం అయ్యారని తెలిపారు.

Similar News

News March 31, 2025

CM తలపెట్టిన ‘P4’ గొప్ప ఆలోచన: అనగాని

image

AP: విద్యారంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, KG నుంచి PG వరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ‘DSC ద్వారా 16K టీచర్ పోస్టుల భర్తీ చేయబోతున్నాం. CM తలపెట్టిన P4 కార్యక్రమం గొప్ప ఆలోచన’ అని బాపట్ల జిల్లా పర్యటనలో అన్నారు. ఈ సందర్భంగా రేపల్లెలో వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్‌ను ఆయన కోరారు.

News March 31, 2025

విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

image

విశాఖలో మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వేపగుంటలో ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేసి భవనాలు నిర్మించారని రేపర్తి రాజు విజ్ఞప్తి చేశారు. సుజాత నగర్ టీచర్స్ లేఅవుట్‌లో 150 గజాల స్థలాన్ని ఆక్రమించారని లక్ష్మి అనే మహిళ వినతి అందించారు.

News March 31, 2025

IPL: చెన్నైని దాటేసిన ఆర్సీబీ

image

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న IPL జట్టుగా ఆర్సీబీ నిలిచింది. మొత్తంగా 17.8 మిలియన్ల ఫాలోవర్లతో తొలి స్థానానికి ఎగబాకింది. దీంతో ఇప్పటివరకు మొదటి ప్లేస్‌లో ఉన్న CSK(17.7M)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో MI(16.2M) ఉంది. కాగా ముంబై, చెన్నై తలో 5 సార్లు టైటిల్ గెలవగా ఆర్సీబీ ఖాతాలో ఒక్కటీ లేదు. అయినా ఫాలోయింగ్‌లో మాత్రం అదరగొడుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

error: Content is protected !!