News March 20, 2025
విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

రేపటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు వ్రాయాలని సూచించారు. విద్యార్థులు సంవత్సర కాలం పాటు ఉపాధ్యాయుల శిక్షణలో ఎంతో శ్రమించి, పట్టుదలతో ఈ దశకు చేరుకుని పూర్తి స్థాయిలో సన్నదం అయ్యారని తెలిపారు.
Similar News
News April 20, 2025
ప్రైవేట్ స్కూల్లో ప్రవేశం పొందవచ్చు: అల్లూరి డీఈవో

అభాగ్యులు, అనాధ పిల్లలు ఇకపై నేరుగా మీకు దగ్గరలో గల ఏ ప్రైవేట్ పాఠశాలలో (cbse, స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న ) అయినా 1వ తరగతిలో ప్రవేశం పొందవచ్చని అల్లూరి DEO బ్రహ్మాజీరావు ఆదివారం తెలిపారు. ఈ మేరకు 25% కోటా కేటాయించాలని అన్ని ప్రైవేట్ స్కూల్స్కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈనెల 28 నుంచి మే 15 తేదీలోగా https://cse.ap.gov.in ద్వారా online దరఖాస్తు చేసుకొని బడిలో చేరాలన్నారు.
News April 20, 2025
ఎమ్మెస్ రామారావును కడప జిల్లా వాసులు మరచిపోలేరు

ఎమ్మెస్ రామారావు నేపథ్య గాయకుడు మన మధ్య లేకపోయినా కడప జిల్లా వాసులు మరచిపోలేరు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు కలదు, రామాయణ భాగం, సుందరకాండ, హనుమాన్ చాలీసా మంచి గుర్తింపు ఖ్యాతి తెచ్చి పెట్టాయి. గతంలో ఆకాశవాణి కడప రేడియో కేంద్రంలో ప్రతిరోజు ఉదయం పూట సుందరకాండ పారాయణం పాట ప్రసారం చేసేవారు. దానితో ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండేది. నేడు ఎమ్మెస్ రామారావు వర్ధంతి.
News April 20, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.