News March 26, 2025
‘విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు కృషిచేయాలి’

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ సిటీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా కృషి చేయాలని చెప్పారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సమావేశంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
హనుమాన్ జంక్షన్లో తనిఖీలు చేసిన ఎస్పీ

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరికేడు అండర్ పాస్ వద్ద జరిగిన నాకాబందిలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గంగాధరరావు స్వయంగా వాహన తనిఖీలు చేశారు. వాహన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడ నుంచి వస్తున్నది అడిగి తెలుసుకున్నారు.
News April 18, 2025
ఇషాన్ కిషన్పై SRH ఫ్యాన్స్ ఫైర్

IPLలో వరుసగా విఫలమవుతున్న SRH స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తొలి మ్యాచులో సెంచరీతో రాణించినా ఆ తర్వాత జరిగిన అన్ని మ్యాచుల్లోనూ ఆయన తేలిపోయారు. శతకం తర్వాత జరిగిన 6 మ్యాచుల్లో కలిపి 32 పరుగులే చేశారు. ముంబైతో జరిగిన మ్యాచులోనూ సింగిల్ డిజిట్కే ఔటయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో ఇషాన్ను రూ.11.25 కోట్లకు తీసుకుని SRH భారీ మూల్యమే చెల్లించుకుంటోందని ఫైర్ అవుతున్నారు.
News April 18, 2025
గుడ్ప్రైడే ఎందుకు జరుపుకుంటారో తెలుసా!

గుడ్ ఫ్రైడే రోజున ఏసుక్రీస్తు శిలువపై మరణించారని క్రైస్తవులు విశ్వసిస్తారు. మానవాళి సంక్షేమం కోసం ప్రేమ, కరుణ, క్షమాపణ లాంటి గొప్ప సద్గుణాల్ని ఏసు బోధిస్తుంటారు. అది నచ్చని అప్పటి రాజులు క్రీస్తును శిలువ వేస్తారు. ఆ రోజునే క్రైస్తవులు గుడ్ఫ్రైడేగా జరుపుకుంటారు. నల్లని వస్త్రాలు ధరించి తమ పాపాలకు ఏసును క్షమాపణ అడుగుతారు. ఇది జరిగిన 3వ రోజు ఆయన మళ్లీ జన్మించారనే నమ్మకంతో ఈస్టర్ డే జరుపుకుంటారు.