News January 23, 2025
విద్యార్థుల సహాయ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

గురుకులాల్లోని సీట్ల ప్రవేశానికి విద్యార్థుల సహాయార్థం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పర్యవేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఇక్కడ విద్యను పొందితే ఉన్నతంగా రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు.
Similar News
News November 16, 2025
గోపాల్పేటకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

వనపర్తి సంస్థానంలో భాగంగా 1711లో గోపాల్పేట సంస్థానం ఏర్పడింది. చరిత్ర ప్రకారం.. వనపర్తి, గోపాల్పేట ఉమ్మడి ప్రాంతాలను పూర్వం పానుగంటి సీమ అని పిలిచేవారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థానానికి, వనపర్తి, గోపాల్పేట సంస్థానాల మూలపురుషుడు జనంపల్లి వీరకృష్ణారెడ్డి పెద్ద కుమారుడైన వెంకటరెడ్డి గోపాలరావు పేరు మీదగా గోపాల్పేట అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.
News November 16, 2025
కష్టాల్లో టీమ్ ఇండియా.. 75కే 6 వికెట్లు

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. 124 పరుగుల లక్ష్యఛేదనలో 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన సుందర్ (31), జడేజా (16) ఔటయ్యారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 49 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News November 16, 2025
వనపర్తి: న్యాయ సాధన దీక్ష చేపట్టిన బీసీలు

బీసీ రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే బిక్ష కాదని ఇది బీసీల హక్కని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు అన్నారు. పట్టణంలోని మర్రికుంట ధర్నాచౌక్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం, BC JAC ఆధ్వర్యంలో బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచడానికి, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యుల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.


