News December 9, 2024

విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుటకు సర్వ సిద్ధం

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 9, 10 తారీకుల్లో ఎస్ఎఫ్ఎస్ బల్లేపల్లి, పాఠశాలలోని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ప్రాంగణంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుటకు ఏర్పాట్లు చేసినట్లు డిఈఓ సోమశేఖర్ శర్మ తెలిపారు. ప్రదర్శనలో ఇన్స్పైర్‌కు 119 ఎగ్జిబిట్లు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 486 ఎగ్జిబిట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

Similar News

News November 16, 2025

నేటి నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరగతులు

image

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఖమ్మం అధ్యయన కేంద్రంలో నేటి నుంచి వివిధ కోర్సుల తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మొహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. నేటి నుంచి మార్చి 1 వరకు పీజీ ద్వితీయ సంవత్సర తరగతులు జరుగుతాయని, యూజీ సెమిస్టర్ 1, 3, 5 తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.

News November 16, 2025

ఖమ్మం జిల్లాలో 3.5 కోట్ల చేప పిల్లల విడుదల: కలెక్టర్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 3.5 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువుల్లో ఫీడ్ సక్రమంగా అందేలా, నీరు కలుషితంగాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 17 లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాల్లో మృతి చెందిన కనకయ్య, మంగయ్య కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.

News November 16, 2025

KMM: మహిళా డెయిరీ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా: కలెక్టర్

image

ఇందిరా మహిళా డెయిరీ పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎంపీడీవోలను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సమీక్షించిన ఆయన, నిబంధనలను తప్పక పాటించాలని, పశువుల యూనిట్లు అక్రమంగా అమ్మకాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.5వేల మంది లబ్ధిదారులకు 10 వేల పశువుల పంపిణీకి కట్టుదిట్టమైన నిర్వహణ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.