News December 9, 2024
విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుటకు సర్వ సిద్ధం
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 9, 10 తారీకుల్లో ఎస్ఎఫ్ఎస్ బల్లేపల్లి, పాఠశాలలోని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ప్రాంగణంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుటకు ఏర్పాట్లు చేసినట్లు డిఈఓ సోమశేఖర్ శర్మ తెలిపారు. ప్రదర్శనలో ఇన్స్పైర్కు 119 ఎగ్జిబిట్లు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 486 ఎగ్జిబిట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
Similar News
News January 25, 2025
KMM: జులై లోపు మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి: కలెక్టర్
మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం భూసేకరణ పురోగతి, జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జులై లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 24, 2025
KMM: క్రీడలు మానసికోల్లాసానికి దోహదం: అడిషనల్ డీసీపీ
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అడిషనల్ డీసీపీ నరేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు పుట్టకోట రోడ్డులోని శ్రీచైతన్య స్కూల్లో శుక్రవారం ఉడాన్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనారోగ్య సమస్యలు క్రీడలతో దరిచేరవని విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డి, సైదుబాబు, టెన్నిస్ కోచ్ నాగరాజు పాల్గొన్నారు.
News January 24, 2025
చాపరాలపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
ములకలపల్లి మండలం చాపరాలపల్లి గుట్టగూడెం సమీపంలో పేకాట ఆడుతున్న కొంత మంది వ్యక్తులపై పోలీసులు శుక్రవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులతో పాటు రూ.6000 నగదు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ దాడిలో SI కిన్నెర రాజశేఖర్తో పాటు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.