News December 10, 2024

విద్యుత్ వాహనాల పెంపుపై మాగుంట ప్రశ్న

image

దేశంలో, రాష్ట్రంలో విద్యుత్ వాహనాల ఉత్పత్తి, ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీలు, కేటాయించిన నిధులపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మంగళవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సమాధానమిస్తూ గత ఐదేళ్లలో 1,68,263 వాణిజ్య, మూడు చక్రాల, రెండు చక్రాల విద్యుత్ వాహనాలు ఉత్పత్తి అయ్యాయన్నారు. దేశంలో 257 తయారీ యూనిట్లు ఉండగా రాష్ట్రంలో నాలుగు ఉన్నాయని వివరణ ఇచ్చారు.

Similar News

News November 28, 2025

ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థలు బంద్..?

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4న జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం వారు ఒంగోలులో మాట్లాడారు. విద్యార్థి JAC రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ.. విద్యాసంస్థల బందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. జిల్లా యూనివర్సిటీ త్రిబుల్ ఐటీకి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

News November 28, 2025

ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.

News November 28, 2025

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

image

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చెప్పారు. గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు ఆన్లైన్‌లో నమోదు చేయాల్సి ఉందన్నారు.