News May 30, 2024
విద్యుత్ సరఫరాలో సమస్యలు అధిగమిస్తున్నాం: వరుణ్ రెడ్డి
విద్యుత్ సరఫరాలో సమస్యలను అధిగమిస్తున్నామని ఎన్పీడీసీఎల్ CMD వరుణ్ రెడ్డి తెలిపారు. గతేడాది జనవరి నుంచి మే వరకు పరిస్థితిని చూసుకుంటే ఈసారి ట్రిప్పింగ్స్ తగ్గాయని చెప్పారు. గతేడాది 11 కేవీ ట్రిప్పింగ్స్ 57,771 ఉండగా ఈసారి 40,724 నమోదై 29.51 శాతం తగ్గిందన్నారు. గతంలో 10,558 అంతరాయాలు ఉండగా.. 7,262 గంటలకు తగ్గి 31.22 శాతం నమోదైందన్నారు. వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు.
Similar News
News October 4, 2024
వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి నేడు శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ధరలు మాత్రం నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. గురువారం క్వింటా పాత పత్తి ధర రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా అదే ధర పలికింది. అలాగే కొత్తపత్తికి నిన్న రూ.6,925 ధర రాగా నేడు రూ.6,925 అదే ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News October 4, 2024
మలుగు: రోడ్డుపై భారీ కొండచిలువ
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి కుమ్మరిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కొండచిలువ గురువారం రాత్రి ప్రత్యక్షమైంది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 10 అడుగుల పొడవు ఉందని స్థానికులు తెలిపారు. కాగా ప్రయాణికుల చప్పుడుతో పొదల్లోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
News October 3, 2024
వరంగల్: నేడు ఎస్జీటీ అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన
వరంగల్ జిల్లా ఎస్జీటీ 1:3 నిష్పత్తిలో భాగంగా గురువారం 271 నుంచి 435 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. నిన్న సర్టిఫికెట్ పరిశీలనకు రాని అభ్యర్థులు.. ఈరోజు కూడా అటెండ్ అవ్వవచ్చన్నారు. అభ్యర్థులు వచ్చే ముందు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత గెజిటెడ్ సంతకంతో సర్టిఫికెట్లన్నీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అన్నారు.