News September 3, 2024
విద్యుత్ సిబ్బంది.. అనంతపురం నుంచి విజయవాడకు పయనం

భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలయం అయింది. ఆహారం, విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సాయం చేసేందుకు అనంతపురం విద్యుత్ శాఖ సిబ్బంది విజయవాడకు వెళ్లారు. విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. విజయవాడలో విద్యుత్ మరమ్మతులు చేసేందుకు అనంతపురం నుంచి బృందం తరలి వెళ్లిందని చెప్పారు. వెళ్లిన వారిలో విద్యుత్ శాఖ ఈఈ రమేశ్, డీఈలు, ఏఈలు ఉన్నారని తెలిపారు.
Similar News
News September 18, 2025
అనంత జిల్లాకు 1482.30 మెట్రిక్ టన్నుల యూరియా

అనంతపురం జిల్లాకు RCF సంస్థ నుంచి 1482.30 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుందని DA అల్తాఫ్ అలీ ఖాన్ తెలిపారు. ప్రసన్నాయిపల్లి రేట్ పాయింట్ వద్ద ఆయన యూరియాను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్కు 899.01 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 583.29 మెట్రిక్ టన్నులు కేటాయించామని వెల్లడించారు.
News September 17, 2025
అనంత నుంచి అమరావతికి 45 బస్సులు.. 2,100 మంది సిద్ధం

అనంతపురం జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈనెల 19న అమరావతిలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు జిల్లా నుంచి 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అందులో వారి కుటుంబ సభ్యులు, విద్యాశాఖ అధికారులు.. మొత్తం 2,100 అమరావతికి వెళ్లనున్నట్లు తెలిపారు.
News September 17, 2025
పంట నమోదుకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం

పంట నమోదుకు ఈనెల 30వ తేదీ చివరి గడువు అని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించి, రైతులను పంట వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. 2025-26 సంవత్సరం PM కిషన్ అన్నదాత సుఖీభవ పథకంలో రెండో విడత అక్టోబర్లో విడుదల చేస్తామని చెప్పారు. అకౌంట్ నంబర్ను మొబైల్ నంబర్తో లింక్ చేసుకోవాలని సూచించారు.