News July 24, 2024

విధుల్లో అలసత్వం.. డ్రెయిన్ల శాఖ ఈఈ సస్పెండ్

image

భారీ వర్షాలు.. వరదల వేళ విధుల్లో అలసత్వం వహించి గోస్తని డ్రెయిన్‌‌కు గండి పడటానికి కారణమైన డ్రెయిన్ల శాఖ ఈఈ MVV కిషోర్‌ను ప.గో కలెక్టర్ సి.నాగరాణి మంగళవారం సస్పెండ్ చేశారు. పాలకోడెరు మండలం మోగల్లు వద్ద గోస్తని డ్రెయిన్‌కు గండి పడటానికి ఈఈ పర్యవేక్షణ లోపం, సరైన ముందస్తు చర్యలు లేకుండా బాధ్యతా రాహిత్యంతో ఉండటమే కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News November 21, 2025

ప.గో: రూ. 2కోట్లు గోల్ మాల్ ?

image

తణుకులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు బంగారం గోల్‌మాల్‌ అయిన వ్యవహారం రాజుకుంటోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బందితో చేతులు కలిపిన తణుకు శాఖ మేనేజర్‌ ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు బయట బంగారం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇలా సుమారు రూ.2 కోట్లు విలువైన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.

News November 21, 2025

మొగల్తూరులో సినిమా హాల్ పరిశీలించిన జేసీ

image

మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్‌ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పేరు మార్పుపై వచ్చిన విషయంపై థియేటర్‌ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం యాజమాన్యానికి పలు సూచనలు చేశామన్నారు. థియేటర్‌లో ఎగ్జిట్ బోర్డులు, ఫైర్ సేఫ్టీ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ధియేటర్ సిబ్బందికి సూచించారు.

News November 21, 2025

ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

image

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.