News February 16, 2025
విధుల నుంచి చోద్యం పీఈటీ తొలగింపు

గొలుగొండ మండలం చోద్యం జడ్పీ హైస్కూల్ పార్ట్టైమ్ పీఈటీ కుందూరు నూకరాజును అధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు డీఈవో జి.అప్పారావు నాయుడు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినులపై నూకరాజు అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా రుజువు కావడంతో అధికారులు వేటు వేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎం శ్రీనివాస్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Similar News
News November 15, 2025
ఏలూరు: నడిరోడ్డుపై భార్య హత్య.. భర్త అరెస్ట్

విజయవాడలోని సూర్యారావుపేట వద్ద <<18282978>>గురువారం మధ్యాహ్నం నూజివీడులోని అజరయ్యపేటకు చెందిన సరస్వతిని<<>> ఆమె భర్త విజయ్ హత్య చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య కలహాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితుడు విజయ్ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ ఆలీ చెప్పారు. అతని వద్ద నుంచి రెండు పదునైన ఆయుధాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు.
News November 15, 2025
పెరుగుతున్న చలి.. జాగ్రత్తలు పాటించండి: DMHO

చలి తీవ్రత పెరుగుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని MHBD జిల్లా ఆరోగ్య వైద్యాధికారి రవి రాథోడ్ తెలిపారు. చలికాలంలో వచ్చే వ్యాధులలో జ్వరం, జలుబు, దగ్గు మొదలగు ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉందన్నారు. చిన్నారులతో ఉదయం ప్రయాణం చేయకూడదని, రాత్రి వేళలో చల్లగాలి ఇంట్లోకి రాకుండా కిటికీలు మూసి వేయాలన్నారు. వేడినిచ్చే హై వోల్టేజ్ బల్బులు వాడాలన్నారు. శీతల పానీయాలు తాగొద్దని సూచించారు.
News November 15, 2025
అమరావతిలో భారీగా పెట్టుబడులు

అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రకాల సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సీఐఐ సదస్సులో పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. సదస్సు తొలి రోజు లోనే సుమారు రూ. 32 వేల కోట్ల పెట్టుబడులను CRDA ఆకర్షించింది. మొత్తం ఎనిమిది సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో అమరావతి ప్రాంత వాసులు, CRDA వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


