News June 25, 2024

విధుల నుంచి రిలీవ్‌ అయిన కర్నూల్ కలెక్టర్‌

image

కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి డా.జి.సృజన రిలీవ్ అయ్యారు. NTR జిల్లా కలెక్టర్‌గా బదిలీ అవడంతో జేసీ నారపురెడ్డి మౌర్యకు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. తాను జిల్లా కలెక్టర్‌గా విధులను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్క అధికారి సహకరించారని తెలిపారు. హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఎన్నికలను విజయంవంతంగా నిర్వహించామని చెప్పారు. జిల్లా అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 13, 2025

కర్నూలు జిల్లాకు ‘దామోదరం’ పేరు పెట్టాలి: వీహెచ్

image

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీకి రెండో సీఎంగా ఆయన సేవలు అందించారని, తొలి దళిత ముఖ్యమంత్రి కూడా ఆయనే అని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి జిల్లాకు దామోదరం పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. కాగా సంజీవయ్య జిల్లాలోని కల్లూరు మండలం పెద్దపాడులో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు 1921లో జన్మించిన విషయం తెలిసిందే.

News February 13, 2025

‘భీముని కొలను’ గురించి తెలుసా?

image

పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తుండగా ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికారని చరిత్ర చెబుతోంది. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పడంతో గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు దూకాయట. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చిందని అంటారు.

News February 13, 2025

కర్నూలు జిల్లాలో ఉరేసుకుని వివాహిత మృతి

image

కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామంలో విషాద ఘటన జరిగింది. 21ఏళ్ల వివాహిత అనూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అనూష, శాంతరాజును ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. అనూష మృతికి కుటుంబ ఆర్థిక సమస్యలు కారణమా? గృహ కలహాలా? లేక మరేదైనా కారణమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

error: Content is protected !!