News March 12, 2025
వినయ్ చంద్కు అన్నమయ్య జిల్లా బాధ్యతలు

అన్నమయ్య జిల్లా ప్రత్యేకాధికారిగా వాడ్రేవు వినయ్ చంద్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు. మరోవైపు కడప జిల్లా ప్రత్యేక అధికారిగా సౌరభ్ గౌర్ నియమితులయ్యారు.
Similar News
News December 13, 2025
పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులకు ఆదేశించారు. ఎస్పీ రోహిత్ రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లావణ్య, ఎంపీడీఓ, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో సూచనలు చేశారు.
News December 13, 2025
KNR: అక్కా.. ఫ్రీ బస్సులో వద్దు, లగ్జరీలో రా.!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, మూడో విడత ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణాల్లో ఉన్న ఓటర్లను, ముఖ్యంగా మహిళా ఓటర్లను, పల్లెలకు రప్పించేందుకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. “అక్కా.. ఫ్రీ బస్సులో ఇబ్బంది పడొద్దు, సూపర్ లగ్జరీలో రా” అంటూ ఫోన్లు చేసి ఓటు కోసం ప్రేమను ఒలకబోస్తున్నారు.
News December 13, 2025
పాల మొదటి 2 ధారలు, గోటి పరీక్ష ముఖ్యం

☛ కొన్ని గేదెల పొదుగు పెద్దగా ఉన్నా లోపల పొదుగు వాపు ఉండే ఛాన్సుంది. అందుకే నల్లటి గిన్నెలో పాలను పితికి మొదటి రెండు ధారలను పరిశీలించాలి. అందులో గడ్డలు, రక్తం లేదా నీళ్ల విరుగుడు కనిపిస్తే ఆ గేదెను కొనవద్దు.
☛ మెషిన్ లేకుండానే పాలలో వెన్నశాతం చెక్ చేయాలి. దీనికి పాలు పితికిన వెంటనే ఒక చుక్కపాలను బొటన వేలు గోరు మీద వేయాలి. ఆ చుక్క జారిపోకుండా గోరు మీదే ఉంటే అవి చిక్కటి పాలుగా గుర్తించాలి.


