News September 6, 2024
వినాయక చవితిని శాంతియుతంగా జరిగేలా చూడాలి :కలెక్టర్
వినాయక చవితి పండుగ ను శాంతియుత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News September 29, 2024
మరాఠీ పాటల పోటీలలో రాణిస్తున్న ముధోల్ చిన్నారి
ముధోల్ మండల కేంద్రానికి చెందిన గడపాలె అంజలి ప్రముఖ మరాఠీ ఛానల్లో నిర్వహిస్తున్న “మీ హోణార్ సూపర్ స్టార్ చోటే ఉస్తాద్ సీజన్-3” సింగింగ్ షోలో అద్భుతంగా పాటలు పాడుతూ సెమీఫైనల్కు చేరుకుంది. ఈ సందర్భంగా చిన్నారి చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థి పాటల్లో రాణిస్తూ సెమీ ఫైనల్కు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
News September 29, 2024
ఆసిఫాబాద్: పాఠశాల గదిలోకి పాము
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలం కన్నెపల్లి యూపీఎస్ పాఠశాల తరగతి గదిలో శనివారం పాము రావడంతో విద్యార్థులు పరుగులు పెట్టారు. ఇలా గదులలోకి పాములు, తేళ్లు, క్రిమి కీటకాలు రావడంతో విద్యార్థులు భయందోళనకు గురవుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.
News September 29, 2024
దసరా నవరాత్రుల్లో బాసర అమ్మవారు దర్శనం ఇచ్చే అవతారాలు ఇవే
బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అలంకరిస్తామన్నారు. మొదటిరోజు శేలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడవరోజు చంద్రఘటా, నాలుగోరోజు కూష్మాండ అలంకరణ, ఐదోరోజు స్కదమాతగా, ఆరోరోజు కాత్యాయగాని, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజు మహాగౌరీగా, తొమ్మిదోజు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తారని తెలిపారు.