News September 3, 2024

‘వినాయక చవితి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి’

image

ఈనెల 7న వినాయక చవితి పండుగను ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. మంటపాలలో అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. విద్యుత్ వైర్లను ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలని, ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలని, మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని ఎస్పీ అన్నారు.

Similar News

News December 21, 2025

ఒంగోలు: సామాన్యుడి ఒక్క ట్వీట్.. ఎంత పని చేసిందంటే?

image

ఒక సామాన్య వ్యక్తి చేసిన ఒక్క ట్వీట్, రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద గల పట్టాలపై ప్రయాణికులు దాటే పరిస్థితిని ఒకరు గమనించారు. రైలు వచ్చే క్రమంలో కూడా ప్రయాణికులు పట్టాలు దాటితే.. ఎంత ప్రమాదమో. ఒక ప్రయాణికుడు ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేకు ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇక అంతే ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు తనిఖీ చేసి నిన్న 10 మందిపై కేసులు నమోదు చేశారు.

News December 21, 2025

ఒంగోలు: ఈతకు వెళ్లి బీటెక్ విద్యార్థి మృతి.. పూర్తి వివరాలివే!

image

ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి హర్ష (18) ఈతకు వెళ్లి మడనూరు వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే. 9 మంది స్నేహితులతో కలిసి వెళ్లిన హర్ష మడనూరు తీరం వద్దకు చేరుకోగానే మొదటగా ఇద్దరితో కలిసి తీరంలోకి వెళ్లాడు. ఒకరు అలల ధాటికీ తట్టుకోలేక బయటకు రాగా.. హర్ష, రాధాకృష్ణమూర్తి ఊపిరి ఆడని పరిస్థితికి చేరుకున్నారు. అయితే హర్ష మృతి చెందగా.. రాధాకృష్ణను వైద్యశాలకు తరలించారు.

News December 21, 2025

ఉగ్ర నరసింహారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే.!

image

ప్రకాశం టీడీపీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2015లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలు అందించి, 2019లో టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకొని, జిల్లా అధ్యక్షుడి పదవిని దక్కించుకన్నారు.