News September 11, 2024

వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్, ఎస్పీ

image

వినాయక నిమజ్జనోత్సవాలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం మెట్పల్లి పట్టణంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే వాగు ప్రాంతాన్ని వారు పరిశీలించారు. వాగు ఒడ్డుకు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిమజ్జనం ఉత్సవాలు రాత్రివేళ ఉంటాయని, పట్టణంలోని అన్ని వీధుల్లో వీధిలైట్లు ఉండాలన్నారు.

Similar News

News November 27, 2025

రామడుగు: నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

image

రామడుగు మండలం వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిర, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. తొలి విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని 92 సర్పంచ్, 866 వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.

News November 27, 2025

కరీంనగర్‌కు వచ్చిన పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు

image

పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు, HACA మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి గురువారం కరీంనగర్ కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే కలిసి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో సమావేశమయ్యారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.

News November 26, 2025

KNR: జిల్లా మ్యూజియం అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం జిల్లా మ్యూజియంను సందర్శించి, అన్ని విభాగాలను పరిశీలించారు. మ్యూజియం అభివృద్ధి, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు, కొత్త ప్రదర్శనల ఏర్పాటు వంటి అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మ్యూజియం ఆధునికీకరణకు అవసరమైన చర్యలను త్వరగా చేపట్టాలని ఆమె సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కూడా ఉన్నారు.