News March 4, 2025
వినికిడి సమస్యను సాంకేతికతతో అధిగమిద్దాం: మంత్రి

వినికిడి సమస్యను సాంకేతికతతో అధిగమిద్దామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. వరల్డ్ హియరింగ్ దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒక శబ్దాన్ని వినగల్గడం అనేది భగవంతుడు మన అందరికి ఇచ్చిన గొప్ప వరమని పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక సమస్యల వల్ల మన సమాజంలోనే కొంతమంది వినికిడి లోపాన్ని కల్గి ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈఎన్టీ సమస్యలను ఆరోగ్యశ్రీ లోకి తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
Similar News
News September 15, 2025
వనపర్తి: మహిళలు, పిల్లల ఆరోగ్యానికి ‘స్వస్థ నారీ, సశక్తి పరివార్’: కలెక్టర్

మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్థ నారీ, సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలతో మహిళలు, పిల్లల సాధికారత సాధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
News September 15, 2025
విశాఖలో 15 హోటల్స్పై క్రిమినల్ కేసులు

గత నెల ఒకటి రెండు తేదీల్లో ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 81 హోటల్స్లో శాంపిల్స్ సేకరించి ఫుడ్ ల్యాబరేటరీకి పంపించారు. వీటి ఫలితాలు రావడంతో 15 హోటల్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని మరో 14 హోటల్స్పై జేసి కోర్టులో జరిమానా విధిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి ఓ ప్రకటనలో తెలిపారు. హోటల్స్ యజమానులు ఫుడ్ సేఫ్టీ ప్రకారం నాణ్యత పాటించాలన్నారు.
News September 15, 2025
ఏపీలో ఐఏఎస్ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా సౌర్యమాన్ పటేల్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఐపీఎస్ రాహుల్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.