News March 4, 2025

వినికిడి సమస్యను సాంకేతికతతో అధిగమిద్దాం: మంత్రి

image

వినికిడి సమస్యను సాంకేతికతతో అధిగమిద్దామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. వరల్డ్ హియరింగ్ దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒక శబ్దాన్ని వినగల్గడం అనేది భగవంతుడు మన అందరికి ఇచ్చిన గొప్ప వరమ‌ని పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక సమస్యల వల్ల మన సమాజంలోనే కొంతమంది వినికిడి లోపాన్ని కల్గి ఉంటున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈఎన్టీ సమస్యలను ఆరోగ్యశ్రీ లోకి తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

Similar News

News November 7, 2025

అమరావతి సిగలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్

image

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అమరావతిలో భారీ క్వాంటమ్ కంప్యూటర్‌(1,200 క్యూబిట్ సామర్థ్యం)ను ఏర్పాటు చేయనుంది. రూ.1,772 కోట్ల పెట్టుబడికి సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం అవసరముంటుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే IBM 133 క్యూబిట్, జపాన్‌కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.

News November 7, 2025

రాజమౌళి చిత్రం నుంచి బిగ్ అప్డేట్

image

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ(SSMB29) నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను జక్కన్న సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘పృథ్వీతో మొదటి షాట్ పూర్తవగానే అతని దగ్గరికి వెళ్లి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరు అని చెప్పాను. శక్తిమంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’(పృథ్వీ క్యారెక్టర్ పేరు)కు ప్రాణం పోయడం సంతృప్తికరం’’ అని రాసుకొచ్చారు.

News November 7, 2025

డిజిటల్ సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

తూ.గో. జిల్లా వ్యాప్తంగా ‘మన మిత్ర’ వాట్సాప్‌ ఆధారిత సేవలపై శుక్రవారం నుంచి డోర్‌ టు డోర్‌ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాట్సాప్‌ సేవల డెమో, క్యూఆర్‌ కోడ్‌ పంపిణీ, పాంప్లెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ప్రతి ఇంటిని కవర్‌ చేసి, నమోదు అయిన కుటుంబాల వివరాలను రికార్డు చేయాలని కలెక్టర్‌ సూచించారు.